పాట్నా : బిహార్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. పాట్నాలోని రాజ్భవన్లో కొత్త మంత్రులతో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ హాజరయ్యారు. మరో వైపు నితీశ్ కేబినెట్లో తేజ్ప్రతాప్కు మరోసారి చోటు దక్కింది. దీంతో ఆయన నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రమాణస్వీకారం చేశారు. మొదట మంత్రులుగా విజయ్కుమార్ చౌదరి (జేడీయూ), విజేందర్ యాదవ్ (జేడీయూ), అలోక్ మెహత (ఆర్జేడీ), తేజ్ ప్రతాప (ఆర్జేడీ), అఫాక్ ఆలం (కాంగ్రెస్)తో గవర్నర్ ప్రమాణం చేయించారు.
జేడీయూ నుంచి తేజస్వి యాదవ్తో కలిసి మొత్తం ప్రభుత్వం 16 మంత్రి పదవులు దక్కాయి. ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్, సమీర్ మహాసేత్, వీరేంద్ర , అక్తరుల్ షాహీన్, అలోక్ మెహతా, అనితా దేవి, రామానంద్ యాదవ్, లలిత్ యాదవ్, సురేంద్ర యాదవ్, చంద్రశేఖర్, సుధాకర్ సింగ్, సర్వజిత్ కుమార్, సురేంద్ర రామ్, షానవాజ్, భరత్ భూషణ్ మండల్.. జేడీయూ నుంచి విజయ్ చౌదరి, సంజయ్ ఝా, సునీల్ కుమార్, శ్రవణ్ కుమార్, బిజేంద్ర యాదవ్, అశోక్ చౌదరి, షీలా మండల్, జమా ఖాన్, లేషి సింగ్, జయంత్ రాజ్, మదన్ సాహ్ని.. కాంగ్రెస్ నుంచి అఫక్ ఆలం, మురారీ, ప్రసాద్ గౌతమ్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
Tej Pratap Yadav, RJD leader and brother of Deputy CM Tejashwi Yadav, takes oath as a minister in the Bihar cabinet. #BiharCabinetExpansion pic.twitter.com/68zpjRUuPO
— ANI (@ANI) August 16, 2022