కాన్పూర్, డిసెంబర్ 29: అధికారంలో లేని రాష్ర్టాల్లో అధికార పార్టీ సభలకు అడ్డంకులు సృష్టించి గలాటా చేయటమే పనిగా పెట్టుకున్న బీజేపీకి ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) గట్టి గుణపాఠం నేర్పింది. ఒక ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మకంగా, బాధ్యతగా ఎలా వ్యవహరించాలో చేసి చూపింది. ప్రధాని మోదీ కాన్పూర్ పర్యటనలో గొడవకు యత్నించిన ఐదుగురు సొంత కార్యకర్తలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎస్పీ కార్యకర్తలు మంగళవారం కాన్పూర్లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ఓ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వాహనంపై మోదీ పోస్టర్లు ఉండడంతో ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ ఆరోపించింది.