న్యూఢిల్లీ: క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రస్తుతం బ్రేక్లో ఉన్నాడు. మళ్లీ ఆసియాకప్లో అతను ప్యాడప్ కానున్నాడు. అయితే ఆ బ్రేక్ సమయంలో అతను కొన్ని ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొంటున్నాడు. తాజా ప్యూమా కోసం ఓ యాడ్ చేశాడు. ఆ యాడ్కు చెందిన ఫోటోలను భార్య అనుష్కా శర్మ తన ఇన్స్టాలో పోస్టు చేసింది. ఇద్దరు కలిసి రన్నింగ్ చేస్తున్న ఫోటోను అనుష్కా పోస్టు చేసింది. ఆ ఫోటోలపై క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ కామెంట్ చేశారు. కోహ్లీని తనదైన స్టయిల్లో ట్రోల్ చేశాడు. భయ్యా.. మీ రన్నింగ్ టెక్నిక్ లోపించినట్లు ఉందని సూర్య తన కామెంట్లో పేర్కొన్నాడు.
వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో ఆడిన కోహ్లీ.. ఇక ఆసియాకప్లో సెప్టెంబర్ రెండో తేదీన పాక్తో జరగనున్న మ్యాచ్తో మళ్లీ క్రీజ్లో అడుగుపెట్టనున్నాడు. ఆ హై వోల్టేజ్ మ్యాచ్ గురించి అప్పుడే ఫుల్ హీట్ నడుస్తోంది. బాబర్ ఆజమ్ ఫామ్లో ఉన్నాడని, అతనికి కోహ్లీ కంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని ఓ చర్చలో పాక్ మాజీ బౌలర్ అకీబ్ జావెద్ అన్నాడు. దీంతో ఇండోపాక్ మ్యాచ్పై ఆసక్తిని రేపాడు. ఇక కోహ్లీ ఆ మ్యాచ్ కోసం జోరుగా ప్రిపేరవుతున్నట్లు తెలుస్తోంది.