హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): దేవుడి పేరుతో ఆన్లైన్లో డబ్బులు దండుకుంటున్న సైబర్ నేరగాళ్లపై ఏఐతో జాతీయ సైబర్ క్రైమ్ పోలీసులు గస్తీ కాస్తున్నారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు అయోధ్య లైవ్, రాముడి కాలర్ ట్యూన్స్, విరాళాలు, ప్రసాదం, వీఐపీ పాస్లు అంటూ అమాయకుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. అప్రమత్తమైన జాతీయ సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నతస్థాయి సైబర్ నిపుణుల బృందంతో అయోధ్య కేంద్రంగా నిఘా వేశారు.
అయోధ్య, జై శ్రీరామ్, రామ్, రామ్లల్లా, ప్రాణ్ ప్రతిష్ఠ్ లైవ్, అయోధ్య లైవ్, ఆఫరింగ్స్, అయోధ్య ట్రైన్, ఫ్లైట్ టికెట్లు వంటి కొన్ని పదాలతో ఆన్లైన్లో ఎవరు వెతికినా.. ఆ వివరాలు ఐ4సీకి అందేలా ఏఐ సాయం తీసుకుంటున్నట్టు తెలిసింది. సైబర్ నేరగాళ్లు పంపే లింకులపై నిరంతరం ఏఐతో నిఘా ఉంటుందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారి చెప్పారు. ‘అయోధ్య లైవ్’ పేరుతో వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ప్రజలను హెచ్చించారు.