ఢిల్లీలోకాలుష్యంని తగ్గించడానికి పంట వ్యర్థాల కాల్చివేతపై నిషేధం విధించాలని, కొత్తగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ని అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్.జేబీ.పర్దివాల్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. శశాంక్ శేఖర్ ఝా అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశాడు. ‘పంట వ్యర్థాల కాల్చివేతపై నిషేధం విధించనంత మాత్రాన ఢిల్లీలో కాలుష్యం తగ్గిపోతుందా?’ అని పిల్ దాఖలు చేసిన శశాంక్ శేఖర్ ఝాని ధర్మాసనం ప్రశ్నించింది. ఢిల్లీ కాలుష్యానికి మీరు చెప్పే పరిష్కారం ఏంటి? అని శశాంక్ని జస్టిస్.డి.వై. చంద్రచూడ్ అడిగారు.
‘పంట వ్యర్థాలపై మేము నిషేధం విధించామే అనుకోండి? దాంతో ఢిల్లీలో కాలుష్యం తగ్గుతుందా? పంట వ్యర్థాల్ని కాల్చకుండా ప్రతి రైతును అడ్డుకోగలమా? ఈ సమస్యకు సహేతుకమైన పరిష్కారలు ఆలోచించాలి. కొన్ని విషయాల్లో కోర్టులు కొంతవరకే పనిచేస్తాయి. అలానే కొన్నింటిని కోర్టు ఆదేశాల ద్వారా మార్చలేం’ అని పిల్ విచారణను తోసిపుచ్చుతూ ప్రధాన న్యాయమూర్తి అన్నారు.