Prophet Row | ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి నూపుర్ శర్మ కేసులో జర్నలిస్ట్ నవికా కుమార్కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఆయా రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో నవికాను అరెస్టు చేయకుండా స్టే ఇస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఓ న్యూస్ చానల్లో ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ఆ తర్వాత నూపుర్తో పాటు నవికా కుమార్పై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భవిష్యత్లో నమోదయ్యే ఎఫ్ఐఆర్లకు సైతం మినహాయింపు ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్లు నమోదైన రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తనపై నమోదు కేసులను కొట్టివేయాలని కోరుతూ నవికా కుమార్ సుప్రీంకోర్టులో రిట్పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించి.. కేంద్ర, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసి, సమాధానాలు కోరింది.