ముషీరాబాద్, మే 31 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 57 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనునిత్యం వందలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు షాదీముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ముషీరాబాద్ కార్పొరేటర్ ఎన్.సుప్రియా నవీన్గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ చందన, ఆర్ఐలు విజయ్, ఆదిల్, టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, సయ్యద్ హమ్మదుల్లా, శ్రీనివాస్గుప్త, ముచ్చకుర్తి ప్రభాకర్, రాంచందర్, రవీందర్, బల్ల ప్రశాంత్, శివముదిరాజ్, మల్లేశ్యాదవ్, బీజేపీ నాయకుడు నవీన్ గౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.