న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం మా నిర్ణయాలను గౌరవించడం లేదని, మా సహనాన్ని పరీక్షించవద్దని సుప్రీంకోర్టు మండిపడింది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రిబ్యునల్స్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంపై, ట్రిబ్యునల్ సంస్కరణల చట్టాన్ని ఆమోదించకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ట్రిబ్యునల్స్లో నియామకాలు జరుపకపోవడంపై దాఖలైన పిటిషన్ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర్రావుతో కూడిన ధర్మాసనం.. సొలిసిటర్ జనరల్ తుషార్మెహతాపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘ఇప్పటివరకు ఎంత మందిని నియమించారు? కొందరి నియామకాలు ఉన్నాయని చెప్పారు. ఈ నియామకాలు ఎక్కడ ఉన్నాయి? మద్రాస్ బార్ అసోసియేషన్లో రద్దు చేసిన నిబంధనలు ట్రిబ్యునల్ చట్టాన్ని పోలి ఉన్నాయి. మీకు ఇచ్చిన సూచనల ప్రకారం ఎందుకు నియామకాలు జరుగలేదు. నియామకాలు జరుపకుండా ప్రభుత్వం ట్రిబ్యునల్ను శక్తిహీనంగా మారుస్తున్నది. చాలా ట్రిబ్యునల్స్ మూసివేత దశలో ఉన్నాయి. ఈ పరిస్థితులపై చాలా అసంతృప్తితో ఉన్నాం. ఇప్పుడు మాకు మూడు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది చట్టాన్ని నిలిపివేయడం, రెండోది ట్రిబ్యునల్ను మూసివేసి వాటి అధికారాలను కోర్టుకు అప్పగించడం, మూడోది మేమే ఆ నియామకాలు చేపట్టడం.. సభ్యుల కొరత కారణంగా ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీలలో పనులు నిలిచిపోయాయి’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
వీటిపై సమాధానమిచ్చేందుకు 2-3 రోజుల సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరడంతో.. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఆలోగా నియామకాలు జరుగుతాయని భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున మరో ఎంపీ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.
బ్రిటన్ ఎంపీలకు కొత్త డ్రెస్ కోడ్
తేజ్ ప్రతాప్ ‘స్టూడెంట్ జన్శక్తి పరిషత్’ ప్రారంభం
తాలిబాన్ క్రూరం.. మాజీ మహిళా పోలీసు అధికారి దారుణహత్య
లాహోర్ను ముట్టడించిన భారత సేనలు
107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..