Supreme Court | సీనియర్ సిటిజన్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు అమలు చేసిన రైలు చార్జీల రాయితీని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశమని, ఆదేశాలు జారీ చేయడం సరికాదని పేర్కొంది. బాలకృష్ణన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ ఎక్కే కౌల్, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం విచారించింది. కరోనా మహమ్మారి సమయంలో నిలిపివేసిన రాయితీలను పునరుద్ధరించాలని పిటిషన్లో కోర్టును విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం.. పిటిషన్పై మాండమస్ రిట్ జారీ చేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. సీనియర్ సిటిజన్ల అవసరాలు, ఆర్థిక పరిమాణాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని, వృద్ధులకు రాయితీలు కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని పిటిషన్ వాదించగా.. వాదనలు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇదిలా ఉండగా.. ఇందకు ముందు కరోనాకు ముందు మాదిరిగానే సీరియర్ సిటిజన్లకు రైల్వేలో తిరిగి రాయితీలను తిరిగి ప్రారంభించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రైల్వేకు సూచించింది. భారతీయ రైల్వేలు కొవిడ్ 60 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులకు 40 శాతం రాయితీని, 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50 శాతం రాయితీని అందించాయి.