న్యూఢిల్లీ, మార్చి 19: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏను సవా ల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. అంతకుముందు పిటిషన్లపై సమాధానం ఇచ్చేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని కేంద్రం తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు.
కాగా, సీఏఏ చట్టంతో ఏ వ్యక్తి పౌరసత్వాన్ని తొలగించబోమని మెహతా ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. సీఏఏ-2019 రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చే వరకు చట్టంలోని నిబంధనల అమలుపై స్టే విధించాల ని కోరుతూ తాజాగా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2019లో పార్లమెంట్ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నాలుగేండ్ల తర్వాత అమలు చేస్తూ లోక్సభ ఎన్నికల వేళ ఇటీవల నిబంధనలను నోటిఫై చేసిన విషయం తెలిసిందే.