న్యూఢిల్లీ: జార్ఖండ్లోని దేవఘర్లో ఉన్న బైద్యనాథ్ జ్యోతిర్లింగ్ ఆలయాన్ని తెరవాలని వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు. తమ పిటిషన్కు ప్రాముఖ్యత ఇవ్వాలని కోరిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రపంచం అంతా కోవిడ్19తో సతమతం అవుతోందని, ఇలాంటి సమయంలో ఈ పిటిషన్పై అత్యవసర విచారణ అవసరం లేదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. పిటిషనర్ తరపున అడ్వకేట్ ప్రశాంత్ కుమార్ వాదించారు. జార్ఖండ్లో కోవిడ్ కేసుల సంఖ్య చాలా స్వల్పంగా ఉన్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో సీజేఐ స్పందిస్తూ.. నిజమే, కోవిడే లేద అన్నారు. అర్జంట్ లిస్టంగ్ నుంచి ఆ పిటిషన్ను తప్పిస్తున్నట్లు సీజే తెలిపారు.