న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీ అడ్మిషన్లను నిలిపివేయాలంటూ దాఖలైన పిటీషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ చేపట్టింది. అడ్మిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పరీక్ష పేపర్ లీకైనట్లు కొందరు పిటీషన్ వేశారు. అయితే ఆ కేసులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కోర్టు సమన్లు జారీ చేసింది. మీరు పరీక్షలు నిర్వహించినంత మాత్రాన పవిత్రమైనట్లు కాదని,కానీ ఆ పరీక్షల పవిత్రత దెబ్బతిన్నదని, దీనిపై తమకు సమాధానాలు కావాలని కోర్టు తెలిపింది. జస్టిస్ విక్రమ్ నాథ్, ఆషానుద్దిన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కౌన్సిలింగ్ను ఆపడం లేదని, కానీ ఈ కేసును జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. ఒకే కోచింగ్ సెంటర్కు చెందిన 67 మంది విద్యార్థులకు సరిగ్గా ప్రతి ఒకరికి 720 మార్కులు వచ్చాయని , అందుకే పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.