న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీవో షేర్ల కేటాయింపుపై కొందరు పాలసీదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఐపీవో షేర్ల కేటాయింపుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్, పీఎస్ నర్సింహాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. వాణిజ్య పెట్టుబడులు, ఐపీవోలపై కోర్టు మధ్యంతర ఆదేశాలు ఇవ్వదని సుప్రీం బెంచ్ తెలిపింది. కేంద్రంతో పాటు ఎల్ఐసీ.. ఐపీవో షేర్ల కేటాయింపుపై 8 వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మే 4వ తేదీన ఎల్ఐసీ ఐపీవోను ఓపెన్ చేసింది.