న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకొన్నది. ఏప్రిల్ 18న వాదనలు విననున్నట్టు సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ వెల్లడించింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా సమాజంపై భారీ ప్రభావం పడుతుందన్నారు.
పెండ్లి విధాన నిర్ణయం: రిజిజు
పెండ్లి అనేది విధాన నిర్ణయమని కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు తెలిపారు. వ్యక్తిగత జీవితం, స్వేచ్ఛ, పనులకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కానీ, పెండ్లి విషయం వ్యవస్థకు సంబంధించినదన్నారు.