న్యూఢిల్లీ : విమాన చార్జీలను హేతుబద్ధీకరించాలని శుక్రవారం సుప్రీంకోర్టు విమానయాన సంస్థలను ఆదేశించింది. ఒకేరోజు ఒకే మార్గంలో విమాన చార్జీల్లో భారీ వ్యత్సాసం ఉంటున్నదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే రోజు ఒకే మార్గంలో ఎకానమీ క్లాస్కు ఒక ఎయిర్లైన్స్ రూ.8 వేలు వసూలు చేస్తే, మరో సంస్థ రూ.18 వేలు వసూలు చేస్తున్నదని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ధర్మాసనం తెలిపింది.
2024లో నూతన చట్టం అమలులోకి వచ్చిందని, దానికి సంబంధించిన నిబంధన ముసాయిదా సంప్రదింపుల దశలో ఉన్నదని సొలిసిటర్ జనరల్ తెలుపగా, విమాన చార్జీలలో తప్పనిసరిగా హేతుబద్ధీకరణ ఉండాలని జస్టిస్ మెహతా వ్యాఖ్యానించారు.