విడాకుల కేసులో తేల్చిచెప్పిన సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: మేజర్ అయ్యేంత వరకూ కొడుకు బాధ్యత కన్న తండ్రిదేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వైవాహిక జీవితంలో గొడవల కారణంగా 2011 నుంచి వేరుగా ఉంటున్న దంపతులకు సంబంధించిన ఓ కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. విడాకులు తీసుకొనేనాటికి ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడని, కాబట్టి, మేజర్ అయ్యేంత వరకూ ఆ బాలుడి బాధ్యత, ఆర్థిక అవసరాలను కన్నతండ్రే చూసుకోవాలని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కూడా ఇదే చెబుతున్నట్టు వెల్లడించింది. పదేండ్లుగా ఆ దంపతులు వేర్వేరుగా ఉంటున్న నేపథ్యంలో.. వారికి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరుచేయడాన్ని సమర్ధించింది. బాలుడి ఖర్చుల కోసం.. అతని తల్లికి నెలకు రూ. 50 వేల చొప్పున ఇవ్వాలని తండ్రిని ఆదేశించింది.