న్యూఢిల్లీ, జనవరి 7: రాష్ట్రస్థాయిలో మైనార్టీలను గుర్తించేందుకు మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్పై సమాధానం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చింది. తమకు మరింత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరగా, నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, ఎంఎం సుంద్రేశ్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఏడు వారాల తర్వాత తదుపరి విచారణ చేపడుతామని పేర్కొన్నది. 10 రాష్ర్టాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారని, మైనార్టీలకు సంబంధించిన పథకాల నుంచి వారికి ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని, ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నదని న్యాయవాది అశ్వినికుమార్ ఉపాధ్యాయ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలను మైనార్టీలుగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు వ్యతిరేకంగా పలు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను బదిలీ చేయాలన్న అభ్యర్థనను కూడా న్యాయస్థానం అంగీకరించింది.