ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీలిక వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్సీపీ గుర్తు అయిన గడియారాన్ని అజిత్ పవార్ వర్గం వాడుకునేందుకు అనుమతించింది. అయితే గడియారం గుర్తు అంశం కోర్టు పరిధిలో ఉందని, దీని వినియోగం తుది తీర్పుకు లోబడి ఉంటుందని అన్ని పత్రికల్లో హిందీ, ఇంగ్లిష్, మరాఠి భాషల్లో పబ్లిక్ నోటీసులు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో శరద్పవార్ ఫొటో వాడుకోవద్దని అజిత్ పవార్ వర్గానికి స్పష్టంచేసింది. మరోవైపు శరద్ పవార్ వర్గం.. ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్చంద్ర పవార్’ పేరును వాడుకునేందుకు అనుమతించింది. వీరికి ‘బాకా ఊదుతున్న మనిషి’ గుర్తును కేటాయించాలని ఎన్నికల కమిషన్కు కోర్టు సూచించింది.