Muslims Reservation | కర్ణాటక (Karnakataka)లో ముస్లింల 4శాతం రిజర్వేషన్లను (Muslims Reservation) తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది. వచ్చే నెల 9 సర్కారు నిర్ణయంపై సర్వోన్నత న్యాయస్థానం విచారించనున్నది. అదే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఉత్తర్వులు ప్రకారం.. మే 9 వరకు ఎలాంటి కొత్త నియామకాలు, అడ్మిషన్లు జరగవని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. కర్ణాటకలో ముస్లింలకు ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి లింగాయత్లు, వొక్కలిగాలకు 2శాతం చొప్పున కేటాయించనున్నట్లు ఇటీవల ప్రకటించింది.
సర్కారు నిర్ణయంపే సుప్రీంకోర్టులో ఈ నెల 13న విచారణ జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం విచారణ జరిపింది. ఈ అంశంపై కోర్టు ప్రభుత్వం స్పందన కోరుతూ ఈ నెల 25కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి విచారణ జరిగింది. కొత్త రిజర్వేషన్ విధానంలో కొత్త నియామకాలు, అడ్మిషన్లు ఉండవని హామీ ఇవ్వగా.. విచారణను మే 9కి సర్వోన్నత న్యాయస్థానం కొత్త రిజర్వేషను విధానంలో కొత్త నియామకం లేదా అడ్మిషన్ ఉండదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ అంశంపై విచారణను మే 9కి వాయిదా వేసింది. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది.