Satyendar Jain | మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. జస్టిస్ ఏఎస్ బోపన్న, బేల ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సత్యేందర్ జైన్, అంకుష్ జైన్ పిటిషన్పై విచారణ జరుపనున్నది. సెప్టెంబర్ 25న సుప్రీంకోర్టు సత్యేందర్ జైన్కు అక్టోబర్ 9 వరకు మధ్యంతర బెయిల్ను పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో కేసు విచారణను ప్రభావితం చేయకూడదని సూచించింది. అయితే, వెన్నుముక చికిత్స కోసం మాజీ మంత్రికి సుప్రీంకోర్టు ఆరువారాల బెయిల్ను మంజూరు చేసింది.
ప్రతి పౌరుడికి సొంత ఖర్చులతో తనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స పొందే హక్కు ఉందని పేర్కొంది. ఆ తర్వాత మళ్లీ బెయిల్ను సెప్టెంబర్ 25 వరకు పొడిగిస్తూ అదే నెల 12న కోర్టు తీర్పునిచ్చింది. నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్కు మంత్రి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తూ గతేడాది మే 30న అరెస్టు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద జైన్పై 2017లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అరెస్టు చేసిన విషయం విధితమే. సీబీఐ నమోదు చేసిన కేసులో ట్రయల్ కోర్టు 2019 సెప్టెంబర్ 6న ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.