Supreme Court | న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలోని మనీలాండరింగ్ కేసులో అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతడి భార్య అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయించేందుకు వీలుగా నాలుగు వారాల బెయిల్ ఇచ్చింది. పాస్పోర్టు సరెండర్ చేసి హైదరాబాద్లో చికిత్స చేయించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. విడుదలయ్యే ముందు ఈడీ అధికారులకు మొబైల్ నంబర్ ఇవ్వాలని, తనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.