Supreme Court | రెండో జాతీయ న్యాయపరమైన వేతన సంఘం (SAJPC) సిఫార్సుల మేరకు దిగువ కోర్టుల జడ్జిలకు రావాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలను చెల్లించేందుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. రాష్ట్రాలు సత్వరమే వేతనా బకాయిలు, ఇతర పెండింగ్ చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. ఇందుకు డిసెంబర్ 8 వరకు గడువును ఇచ్చింది.
జిల్లాల న్యాయవ్యవస్థల్లో పని చేసే న్యాయమూర్తుల వేతన, పింఛన్, జీతభత్యాలు, కుటుంబ పెన్షన్ విషయాలపై జ్యుడీషియల్ పే కమిషన్ తగువిధంగా స్పందించింది. అయితే, మే 19న ఇచ్చిన ఆదేశాలను ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు వాటిని పాటించడం లేదని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ప్రాథమికంగా చూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులు ఉత్తర్వులను ధిక్కరిస్తున్నట్లు కనిపిస్తోందని ధర్మాసనం తెలిపింది.
ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకుండా వ్యవహరిస్తున్నందున తీవ్రంగా పరిగణించాల్సి వస్తోందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం తెలిపింది. వేతన కమిషన్ సిఫార్సుల మేరకు బకాయిల చెల్లింపులు జరగాల్సి ఉందని తాము వెలువరించిన ఆదేశాల బేఖాతరును ఏ విధంగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం హెచ్చరించింది.
జిల్లా న్యాయవస్థ సైతం న్యాయవ్యవస్థలో ముఖ్యమైన భాగమని పేర్కొంటూ ఎస్ఎన్జేపీసీ సిఫారసుల ప్రకారం దిగువ కోర్టు న్యాయమూర్తుల బకాయిలు, ఇతర చెల్లింపులు చేయాలని మే 19న సుప్రీంకోర్టు ఆదేశించింది. 2020లో జస్టిస్ పీవీ రెడ్డి నేతృత్వంలోని ఎస్ఎన్జేపీసీ చేసిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది. అలాగే, న్యాయశాఖ అధికారుల ఖాతాల్లోకి బకాయిలు చెల్లించాలని రాష్ట్రాలను కోర్టు ఆదేశించింది.
ఎస్ఎన్జేపీసీ సిఫార్సులను అమలు చేయడానికి, జిల్లా న్యాయవ్యవస్థలో కేడర్ ఏకరూపత వంటి సమస్యలపై అన్ని అధికార పరిధిలోని న్యాయాధికారుల సర్వీస్ రూల్స్లో అవసరమైన సవరణలు చేయాలని కోర్టు పేర్కొంది. మరో ఉత్తర్వులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అనుగుణంగా న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచడానికి తెలంగాణ హైకోర్టును బెంచ్ అనుమతించింది.
పీఎంఎల్ఏకు సంబంధించిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.