న్యూఢిల్లీ, జనవరి 23: గుజరాత్లో ముగ్గురు ముస్లింలను స్తంభాలకు కట్టేసి కర్రలతో కొట్టిన పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం అరాచకమని నిలదీసింది. వారిపై ఉన్న కోర్టు ధిక్కరణ అభియోగాలపై స్టే పొడిగిస్తున్నట్టు మంగళవారం వెల్లడించింది. ‘ప్రజలను స్తంభాలకు కట్టేసి కొట్టే అధికారం చట్ట ప్రకారం మీకుందా’ అని ధర్మాసనం నిందితులను ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించిన ఘటన అక్టోబర్ 2022న ఖేడా జిల్లాలోని ఉండేలా గ్రామంలో జరిగింది. గర్భా నృత్య కార్యక్రమంపై ముస్లిం గుంపు రాళ్లు రువ్వడంతో కొందరు పోలీసులు, గ్రామస్థులకు గాయాలయ్యాయని ఆరోపణలు వచ్చాయి.