న్యూఢిల్లీ, జనవరి 19: లొంగిపోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని ‘బిల్కిస్ బానో’ దోషులు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. గడువు పొడిగింపుపై వారు చూపిన కారణాలకు ఎలాంటి అర్హతలు లేవని ధర్మాసనం పేర్కొన్నది. గతంలో తాము జారీ చేసిన ఆదేశాల మేరకు లొంగిపోవాల్సిందేనంటూ శుక్రవారం ఆదేశించింది. దీం తో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు వారు ఈ నెల 21న న్యాయస్థానం ముందు లొంగిపోనున్నారు.