న్యూఢిల్లీ: కృత్రిమ మేధాతో తయారు చేసిన తీర్పులను ఎవరైనా కోర్టుల్లో ప్రదర్శిస్తే వారిపై కఠినతరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. కోర్టు పూర్వ తీర్పు ఆదేశాలను వెరిఫికేషన్ లేకుండా గడ్డుగి నమ్మరాదు అంటూ సుప్రీం తెలిపింది. ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దివాళా కేసులో ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీ కోర్టులు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ పీఎస్ నర్సింహా, అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం కొట్టిపారేసింది. ఆ కేసులో నకిలీ, అమలులో లేని, ఊహాజనిత ఏఐ ఆధారిత తీర్పుల ఆధారంగా ఎన్సీఎల్టీ కోర్టు తీర్పు ఇచ్చినట్లు సుప్రీకోర్టు తెలిపింది.
ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా.. ఏఐ ఆధారిత అంశాలను సమర్పిస్తే, ఆ కేసుల్లో ఎవర్నీ సహించాల్సిన అవసరం లేదని సుప్రీం వెల్లడించింది. కోర్టులన్నీ కఠిన చర్యలు తీసుకోవాలన్నది. అలాంటి తీర్పులను సమర్పించే న్యాయవాదులు తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు అవుతుందని కోర్టు తెలిపింది. ఓ నకిలీ, ఊహాజనిత ఏఐక ఆధారిత విషయాలపై ఆధారపడడం.. అది జడ్జీల నిర్లక్ష్యం అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
ఏఐతో చేసిన నకిలీ తీర్పులను నమ్మి.. కోర్టులు తీర్పులు ఇవ్వడం చట్టం దృష్టిలో న్యాయమే కాదు అని ధర్మాసనం పేర్కొన్నది. నిర్ణయాత్మక ప్రక్రియలో ఒకవేళ నకిలీ అంశం వస్తే, ఆ నిర్ణయాలను పక్కన పెట్టాలని కోర్టు పేర్కొన్నది. కృత్రిమ మేధతో జరుగుతున్న న్యాయపరమైన మోసాలను పరిశీలించేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ కమిటని ఏర్పాటు చేయాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొన్నది.
కోర్టు ముందు నకిలీ, ఊహాజనిత అంశాలను పొందుపరిచే లాయర్లపై చర్యలు తీసుకునే రీతిలో మార్గదర్శకాలను బీసీఐ రూపొందించాలని సుప్రీం తన ఆదేశాల్లో వెల్లడించింది. ఏఐ ఆధారిత నకిలీ తీర్పుల వల్ల న్యాయ వ్యవస్థకు తీవ్ర ప్రమాదం ఉన్నట్లు సుప్రీం బెంచ్ చెప్పింది. నకిలీ ఆదేశాలను ప్రవేశపెట్టడం అంటే న్యాయ వ్యవస్థలోకి ప్రాణాంతక మిథైల్ ఐసోసయనేట్ రిలీజ్ చేయడమే అవుతుందని సుప్రీం బెంచ్ చెప్పింది.