న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు శనివారం ఏర్పాటు చేసింది. ఈ బెంచ్లో సీజేఐతో పాటు న్యాయమూర్తులు ఎస్కే కౌల్, రవీంద్ర భట్, హిమా కొహ్లీ, పీఎస్ నరసింహ ఉంటారు.18 నుంచి ధర్మాసనం వాదనలు విననున్నది.