న్యూఢిల్లీ, మే 27: పలు హైకోర్టులకు చెందిన ఆరుగురు జడ్జీల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అషనుద్దీన్ అమానుల్లా పాట్నా హైకోర్టుకు వెళ్లనున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ పురుష ఇంద్ర కుమార్ గౌరవ్ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ కానున్నారు.
ఒడిశా హైకోర్టు జడ్జి జస్టిస్ చిత్తరంజన్ దాస్ను కలకత్తా హైకోర్టుకు, త్రిపుర హైకోర్టు జడ్జి జస్టిస్ సుభాసిస్ తాళపత్రను ఒడిశా హైకోర్టుకు, మణిపూర్ హైకోర్టు జడ్జి జస్టిస్ జమీర్ను గువాహటి హైకోర్టుకు, జమ్ము, కశ్మీర్ హైకోర్టు జడ్జి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ను బాంబే హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది.