న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి (INDIA bloc rally) ప్రజలు అవకాశం ఇస్తే గొప్ప దేశాన్ని నిర్మిస్తామని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం జరిగిన ప్రతిపక్షాల కూటమి ‘లోక్తంత్ర బచావో’ సభలో ఆమె పాల్గొన్నారు. ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే మంచి ఆసుపత్రులు, విద్యతో సహా ఆరు హామీలను నెరవేరుస్తుందని అన్నారు.
కాగా, లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అరెస్ట్ వల్ల జైలులో ఉన్న భర్త అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన ఆరు హామీలను సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు. దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్, దేశంలో పేదలకు ఉచిత విద్యుత్, ప్రతి గ్రామం, మొహల్లాకు మంచి ప్రభుత్వ పాఠశాల, మొహల్లా క్లినిక్, స్వామినాథన్ కమిటీ నివేదిక ప్రకారం రైతులకు మద్దతు ధర లభిస్తుందని చెప్పారు.
మరోవైపు గత 75 ఏళ్లలో ఢిల్లీ ప్రజలు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని సునీతా కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. తాను ఇవాళ ఓట్లు అడగడం లేదని, నవ భారత నిర్మాణం కోసం 140 కోట్ల మంది భారతీయులను ఆహ్వానిస్తున్నానని ఆమె అన్నారు.
#WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, Arvind Kejriwal's wife Sunita Kejriwal reads out his message from the jail.
Quoting Arvind Kejriwal, Sunita Kejriwal says, "I am not asking for votes today… I invite 140 crore Indians to make a new India… India is a… pic.twitter.com/rCPuMYhoex
— ANI (@ANI) March 31, 2024