న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ను (Sunita Kejriwal) రబ్రీ దేవి మాదిరిగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పోల్చారు. సీఎం పదవి చేపట్టేందుకు ఆమె సిద్ధమవుతున్నదని అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన హర్దీప్ సింగ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీహార్లో ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ తర్వాత తన భార్య రబ్రీ దేవిని సీఎంగా చేశారని తెలిపారు. అదే మాదిరిగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం రేస్లో ఉన్నారని చెప్పారు. ‘మీరు చెప్పే మేడమ్ బహుశా బీహార్లో రబ్రీ దేవి మాదిరిగానే ఈ (సీఎం) పదవిని చేపట్టడానికి సిద్ధమవుతున్నారు’ అని అన్నారు.
కాగా, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నామని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎవరితో కలిశారు? అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ప్రశ్నించారు. ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసినా ఆయన స్పందించలేదని విమర్శించారు. ‘అరవింద్ కేజ్రీవాల్ను వదిలేయండి. ఆయన సమయం పరిమితంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi: Union Minister Hardeep Singh Puri says, "…When it was hard to breathe in Delhi, then they (Delhi government) used to blame Punjab for stubble burning, now their government is in Punjab, who did they blame then?… When he (Arvind Kejriwal) joined politics saying… pic.twitter.com/aTy6q8wmMc
— ANI (@ANI) March 29, 2024