సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సుఖ్విందర్ సింగ్ సుఖు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా వీరభద్ర సింగ్ను ఆదివారం ఆమె నివాసంలో కలుసుకున్నారు. సీఎం రేసులో నిలిచిన ప్రతిభా సింగ్తో సుఖు భేటీ కావడం ద్వారా పార్టీలో ఐకమత్యం నెలకొందనే సంకేతాలు పంపినట్లయింది.
ఇక తనను సీఎం పదవికి ఎంపిక చేసినందుకు సుఖ్విందర్ సుఖు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, గాంధీ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభా సింగ్ను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వచ్చానని, ఆమె పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్గా ఉండటంతో తామంతా ఆమె నాయకత్వంలో పనిచేయాల్సి ఉందని సుఖు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖు ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సీఎం రేసులో నిలిచిన మరో నేత ముఖేష అగ్నిహోత్రి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండగా, ప్రతిభా సింగ్ కుమారుడు, సిమ్లా రూరల్ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ కీలక మంత్రిత్వ శాఖను చేపట్టనున్నారు. కాగా సుఖ్విందర్ సుఖు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నట్టు ప్రతిభా సింగ్ తెలిపారు.