షిమ్లా: హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్దిసేపటి ముందు సుఖ్విందర్ సింగ్ సుఖు తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరుతూ తల్లికి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా ఆమె తన కొడుకు విజయవంతంగా బాధ్యతలు నిర్వహించాలని ఆశీర్వదించారు.
అనంతరం సుఖ్విందర్ తల్లి మీడియాతో మాట్లాడారు. తన కొడుకు ఒక డ్రైవర్ కడుపున పుట్టాడని, డ్రైవర్ కొడుకు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదని అన్నారు. ముఖ్యమంత్రిగా తన కొడుకు ఎన్నో మంచిమంచి పనులు చేస్తాడని ఆమె చెప్పారు.