జైపూర్ : ఈ ఏడాది చివరిలో జరగనున్న రాజస్ధాన్ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కర్నాటక ఫలితం పునరావృతమవుతుందని, రాష్ట్రంలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి భంగపాటు తప్పదని కాంగ్రెస్ పార్టీ రాజస్ధాన్ వ్యవహారాల ఇన్చార్జ్ సుఖ్జిందర్ సింగ్ రంధ్వా పేర్కొన్నారు.
బీజేపీ మాటలు కోటలు దాటతాయని ప్రజలకు మాత్రం ఎలాంటి మేలు చేయదని అన్నారు. గతంలో రెండు సార్లు రాజస్ధాన్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారని, మరోసారి రాష్ట్రానికి రానున్నారని అయినా రాజస్ధాన్కు ఆయన ఒరగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు. రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి పరాభవం తప్పదని, కాంగ్రెస్ ఘనవిజయం సాధించి మరోసారి పాలనా పగ్గాలు చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం అశోక్ గహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తడంతో వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాజస్ధాన్లో అధికారం నిలుపుకునేందుకు అవసరమైన వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ పదును పెడుతోంది.
Read More