Suicide : మెట్రో స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. స్టేషన్లో విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్మీ జవాన్ తన తుపాకీతో తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్లో ఆదివారం ఉదయం ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కుర్చీలో కూర్చుని ఉన్న జవాన్.. తన తుపాకీని తలకు గురిపెట్టుకుని కాల్చుకున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మృతుడు మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన CISF జవాన్ సహరే కిషోర్ అని పోలీసులు తెలిపారు.
సహరే కిషోర్ ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్లో 2022 నుంచి విధులు నిర్వహిస్తున్నాడని అధికారులు చెప్పారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.