Sudha Murty | న్యూఢిల్లీ, మార్చి 8 : సమాజ సేవకురాలు, రచయిత్రి సుధామూర్తిని రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి ముర్ము శుక్రవారం నామినేట్ చేశారు. వివిధ రంగాల్లో ఆమె చేసిన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. ఎగువ సభలో సుధామూర్తి ఉనికి నారీశక్తికి బలమైన నిదర్శనమని ఎక్స్లో స్పందించారు. సుధామూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి భార్య. మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ కూడా అయిన సుధామూర్తి ఎన్నో పుస్తకాలు రచించారు. 73 ఏండ్ల సుధామూర్తిని 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డులు వరించాయి.
మహిళా దినోత్సవం రోజున తనను రాజ్యసభకు నామినేట్ చేయటం రెట్టింపు ఆశ్చర్యాన్ని కలిగించిందని సుధామూర్తి తెలిపారు. ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యత తనకు పూర్తిగా కొత్తదని, దీని గురించి ముందు తెలుసుకోవాలని అన్నారు.