Pulwama Attack | జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నేటికి నాలుగేళ్లు అయ్యింది. 2019 ఫిబ్రవరి 14వతేదీన జమ్మూకశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ (రిజర్వ్ పోలీస్ ఫోర్స్) జవాన్లపై ఉగ్రవాదులు భీకర దాడికి తెగబడ్డారు. ఆ ఘటనలో 40 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే.
పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ‘ఫిబ్రవరి 14న పుల్వామాలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నా నివాళులు. జవాన్ల అత్యున్నత త్యాగాన్ని మేం ఎప్పటికీ మరిచిపోలేం. భారతదేశాన్ని బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి మాకు ఆ వీర సైనికుల ధైర్య సాహసాలే స్ఫూర్తిగా నిలుస్తున్నాయి’ అని మోదీ ట్వీట్ చేశారు.
Remembering our valorous heroes who we lost on this day in Pulwama. We will never forget their supreme sacrifice. Their courage motivates us to build a strong and developed India.
— Narendra Modi (@narendramodi) February 14, 2023
పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నట్లు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆ అమరుల త్యాగాలను భారతదేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. మరోవైపు పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ నివాళులర్పించారు. పూరీలోని ఒడిశా తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్ది.. జవాన్లకు నివాళులర్పించారు.
पुलवामा आतंकी हमले के वीर शहीदों को भावपूर्ण श्रद्धांजलि।
उनका सर्वोच्च बलिदान भारत हमेशा याद करेगा। pic.twitter.com/a39Gpzuq2u
— Rahul Gandhi (@RahulGandhi) February 14, 2023
Tribute to the martyrs of Pulwama!! 🙏#NeverForgetNeverForgive pic.twitter.com/iaD5z2b5Jj
— Sudarsan Pattnaik (@sudarsansand) February 14, 2023