భువనేశ్వర్: ఆదివారం కన్నుమూసిన భారత గాన కోకిల లతా మంగేష్కర్కు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో నివాళి అర్పించారు. ఒడిశాకు చెందిన ప్రసిద్ధ కళాకారుడైన ఆయన పూరీలోని సముద్ర తీరంలో లతా మంగేష్కర్ సైకత శిల్పాన్ని సోమవారం రూపొందించారు. ‘మేరీ ఆవాజ్ హీ పహ్చాన్ హాయ్…’ అన్న థీమ్తో తీర్చిదిద్దిన గాయని సైకత శిల్పం ఎంతో ఆకట్టుకున్నది. ‘భారత గాన కోకిలకు నివాళి, ఓం శాంతి’ అని పేర్కొన్నారు. ఈ సైకత శిల్పం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాగా, కరోనా బారిన పడిన లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతూ చివరకు ఆదివారం తుదిశ్వాస విడిచారు. దీంతో దేశ, విదేశాల నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. ముంబైలోని శివాజీ పార్క్లో ఆదివారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Meri Awaaz hi Pehechan hai..
Tributes to Nightingale of India #LataMangeshkar through my sandart at Puri beach in Odisha.
Om Shanti 🙏🏻 pic.twitter.com/uUeguCYX4y— Sudarsan Pattnaik (@sudarsansand) February 6, 2022