భువనేశ్వర్: దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సందర్భమేదైనా ఇసుకతో బొమ్మలను తయారుచేసే ప్రముఖ స్యాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్.. మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఒడిశాలోని పూరీ బీచ్లో 3,425 ఇసుక లడ్డూలతో వినాయకుని చిత్రాన్ని కలర్ఫుల్గా రూపొందించారు. రెండు ఏనుగులు గణేశునికి పూజ చేస్తున్నట్లు మట్టితో తయారుచేసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా, ఆలోపించేసేలా ఉన్నది. హ్యాపీ గణేశ్ పూజ అని సందేశమిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులు మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
Happy #GaneshChaturthi .My SandArt of Lord Ganesh by using 3,425 sand ladoos and Some Flowers at Puri beach in Odisha . pic.twitter.com/ruIOUDzaEj
— Sudarsan Pattnaik (@sudarsansand) August 31, 2022
ఇక ముంబైలోని లాల్బగ్చాలో వినాయక పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే ఆ గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.
#WATCH | Maharashtra | People offer prayers at Lalbaugcha Raja, Mumbai on the occasion of #GaneshChaturthi pic.twitter.com/notrrtFuaA
— ANI (@ANI) August 31, 2022