న్యూఢిల్లీ: ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని మోదీ(PM Modi) పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి వర్ధిల్లిలాలని ఆయన ఆశించారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సంయుక్తంగా కలిసి ఉండడంలోనే మానవత్వం విజయం సాధిస్తుందని, యుద్ధ రంగంలో కాదు అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం .. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు కీలకమని, ఆధునీకరణకు సంస్కరణే ముఖ్యమైందన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్, ఇజ్రాయిల్లో యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Speaking at the 79th UN General Assembly session, PM Modi says, “Success of humanity lies in our collective strength, not in the battlefield. For global peace and development, reforms in global institutions are important. Reform is the key to relevance.” pic.twitter.com/UoXtPVGArN
— ANI (@ANI) September 23, 2024