రాయ్పూర్ : ఏడు రోజుల క్రితం బీజాపూర్ జిల్లా మన్కేళి వద్ద సివిల్ ఇంజినీర్ అజయ్ లక్రా, అటెండర్ లక్ష్మణ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే లక్ష్మణ్ను విడుదల చేయగా, అజయ్ను తమ వద్దే ఉంచుకున్నారు మావోయిస్టులు.
తన భర్తను ప్రాణాలతో వదిలిపెట్టాలని ఇంజినీర్ భార్య అర్పిత నాలుగు రోజుల క్రితం అడవిలోకి వెళ్లింది. తన రెండేళ్ల కూతురిని ఎత్తుకుని, స్థానిక జర్నలిస్టుల సహాయంతో అర్పిత మావోయిస్టుల వద్దకు చేరింది. తన భర్తను ప్రాణాలతో వదిలిపెట్టాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేసింది. ప్రజాకోర్టు నిర్వహించి అజయ్ను మావోయిస్టులు ఇవాళ విడుదల చేశారు.