బెంగళూర్ : కర్నాటకలోని కలబురిగిలో గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఇంట్లో విద్యార్ధులు టాయ్లెట్లు క్లీన్ చేయడం, గార్డెనింగ్ వంటి ఇంటి పనులను చక్కబెడుతున్న ఘటన వెలుగుచూసింది. గత ఏడాదిగా స్కూల్ చిన్నారులతో ప్రిన్సిపాల్ తన ఇంట్లో పనులు చేయిస్తున్నాడనే ఆరోపణలున్నాయి.
మైనారిటీస్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మౌలానా ఆజాద్ మోడల్ స్కూల్స్లోని ఓ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహరంపై దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఓ బాలుడి తండ్రి మహ్మద్ జమీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటకువచ్చింది.
ఈ విషయమై విద్యార్ధుల తల్లితండ్రులు ప్రిన్సిపాల్ను నిలదీయగా పారిశుద్ధ్య విభాగంలో తగినంత సిబ్బంది లేదని ఆమె దురుసుగా బదులిచ్చిందని ఫిర్యాదులో జమీర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు అనంతరం తగిన చర్యలు చేపడతామని పోలీసులు వెల్లడించారు.
Read More :
Congress | కాంగ్రెస్కు బిగ్ షాక్.. పార్టీకి కేంద్ర మాజీ మంత్రి గుడ్బై