మీరట్, నవంబర్ 26: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటుచేసుకొన్నది. మీరట్ జిల్లా మొహల్లా జాగృతి విహార్లో కొంత మంది దుర్మార్గులు ఓ 12 తరగతి విద్యార్థిని చితకబాది, ఆపై బాధితుడి ముఖంపై మూత్రం పోసి వికృతంగా ప్రవర్తించారు. నిందితులు ఈ దారుణాన్ని వీడియో కూడా తీశారు. ఇటీవలే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులు బాధిత విద్యార్థి తల, వెనుక భాగంపై పదేపదే తన్నారు. తనను వదిలేయాలని బాధితుడు వేడుకొ న్నా.. కనికరించకుండా అమానవీయంగా ప్ర వర్తించారు. అనంతరం విద్యార్థి ముఖంపై మూత్రం పోసి దుర్మార్గంగా వ్యవహరించారు. వీడియోలను వైరల్ చేస్తామని బెదిరించి అతని నుంచి డబ్బులు కూడా గుంజుకొన్నారు. మీరట్ పోలీసులు విచారిస్తున్నారు.