అయోధ్య, జనవరి 24: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి అదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీచేయకపోవడమే మంచిదైందని రామమందిరం ప్రధాన పూజారి అచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఇక్కడ ఆయన తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు. మరోవైపు అదిత్యనాథ్ని ఉద్దేశించి స్వామి అవిముక్తేశ్వరానంద కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సాధువు ‘మహంత్’ కావచ్చు.. కానీ సీఎం, పీఎం కాలేడని అన్నారు.