భోపాల్: ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్లపై వీధి కుక్కలు నిద్రిస్తున్న వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. జబల్పూర్ జిల్లా షాపురాలోని ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లో వీధి కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఎంచక్కా రోగుల బెడ్లపై అవి నిద్రిస్తున్నాయి. స్థానిక నివాసి అయిన సిద్ధార్థ్ జైన్ దీనిని తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.
కాగా, ఈ సంఘటనపై జబల్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్ మిశ్రా స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జి అధికారికి నోటీసులు ఇచ్చారు. దర్యాప్తు జరిపి విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరోవైపు సెప్టెంబర్ నెలలో కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. రత్లామ్లోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూ వార్డులోని బెడ్పై కుక్క నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు వీధి కుక్కలకు నిలయాలుగా మారాయని విమర్శించింది.
#Watch | Stray Dogs Seen On Madhya Pradesh Hospital Bed, Probe Ordered https://t.co/aX4jAZfD9B pic.twitter.com/D35TCCrtx5
— NDTV (@ndtv) December 5, 2022