థానె: మహారాష్ట్రలోని థానె జిల్లాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వీధికుక్కపై బతికుండగానే పెట్రోల్ పోసి నిప్పింటించారు. స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఓ 20 ఏండ్ల యువకుడు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా కుక్క సగం కాలిన గాయాలతో పడి ఉన్నది. మిత్రుల సాయంతో సదరు యువకుడు ఆ కుక్కను ఆస్పత్రికి తరలించగా అక్కడ అది మృతిచెందింది.
దాంతో యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా కుక్కను తగులబెట్టిన వారిని గుర్తించే పనిలోపడ్డారు. కాగా, నోరు లేని జీవిని అత్యంత పాశవికంగా బతికుండగానే తగులబెట్టిన ఘటన గురించి తెలిసి స్థానికంగా పలువురు మండిపడుతున్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
పండుగకు పుట్టింటికి కూతురు.. కాల్చిచంపిన కన్నతండ్రి..!
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి
30 కోట్లతో స్వర్గ సీమను నిర్మించుకున్న కంగనా రనౌత్
కేంద్ర పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు