హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఏర్పడిన జవాద్ తుఫాను.. వాయుగుండం మారి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గడిచిన 6 గంటలుగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని పేర్కొంది. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు ఈశాన్యంగా 230 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 90 కిలోమీటర్లు, పూరికి 120 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైనట్లు చెప్పింది.
మధ్యాహ్నం పూరికి దగ్గరగా వెళ్లిన వాయుగుండం.. సాయంత్రానికి బలహీనపడి అల్పపీడనంగా మారిందని పేర్కొంది. రాగల 12 గంటల్లో ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు సమీపంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ వివరించింది. అల్పపీడనం ప్రభావంతో ఒడిశాలోని చాలా జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. గంజాం, ఖుర్దా, పూరీ, కేంద్రపారా, జగత్సింగ్పూర్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.
అలాగే పశ్చిమ బెంగాల్లోని కోల్కతాతో పాటు దక్షిణ ప్రాంతాల్లోనూ వర్షాలు పడ్డాయి. రాబోయే 24 గంటలు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంట పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర తీరం వెంట 12 గంటల పాటు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.తావరణ శాఖ వివరించింది.