న్యూఢిల్లీ, నవంబర్ 23: ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంలో చిక్కుక్కున్న 41మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్కు తుది దశలో అనుకోని అవాంతరం ఎదురైంది. అయితే సొరంగం లోపులున్న కార్మికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు గురువారం రాత్రి వెల్లడించారు. కార్మికులు చిక్కుకుపోయిన చోటకు కొన్ని మీటర్ల దూరంలో గురువారం డ్రిల్లింగ్ మిషన్ పలుమార్లు ఆగిపోయింది. మిషన్కు పలుచోట్ల పలుగులు ఏర్పడ్డాయి. దీనిపై ఇంటర్నేషనల్ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం తిరిగి డ్రిల్లింగ్ మొదలుపెడతామని చెప్పారు.