జైపూర్: దళిత కుటుంబం నిర్వహించిన పెళ్లి ఊరేగింపుపై రాళ్లు రువ్విన కేసులో జైపూర్ పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. గురవారం రాత్రి పెళ్లి కొడుకును ఊరేగిస్తున్న సమయంలో.. రాళ్ల దాడి ఘటన జరిగింది. పెళ్లి కుమార్తె ఇంటికి ఓ గుర్రంపై వస్తున్న సమయంలో భారీ ఎత్తును ఊరేగింపు జరిగింది. జైపూర్లోని కోట్పుత్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఊరేగింపు వేళ రక్షణగా పోలీసులు ఉన్నా.. సుమారు 15 నిమిషాల పాటు ఆ ఊరేగింపును టార్గెట్ చేస్తూ రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది.