భోపాల్ : బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో ఓ దళితుడి పెండ్లి వేడుకపై గ్రామంలోని కొంతమంది పెత్తందారులు రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి 50మందిపై కేసు నమోదుచేశామని మంగళవారం పోలీసులు తెలిపారు. ‘మధ్యప్రదేశ్ ఛాతర్పూర్ జిల్లా చౌరాయి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ దళిత యువకుడి వివాహ వేడుక గ్రామంలో నిర్విహించటాన్ని పెత్తందారీ వర్గాలకు చెందిన కొంతమంది అడ్డుకున్నారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని భద్రత కల్పించాల్సి వచ్చింది. అయినప్పటికీ, పెండ్లి కుమారుడు, అతని బంధువులపై కొంతమంది రాళ్లదాడికి దిగారు’ అని జిల్లా ఎస్పీ అమిత్ సంఘీ చెప్పారు.