ఇంఫాల్: తమ రాష్ట్ర అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మిజోరం సీఎం లాల్దుహోమాకు సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘మిజోరం కొత్త సీఎం లాల్ దుహోమా మణిపూర్లోని తెంగ్నోపాల్ జిల్లాలో ఉన్న మోర్రె పట్టణ ప్రజలను పోలీసులు హింసించకూడదని పేర్కొన్నారని తెలిపారు.
‘అయినా మా రాష్ట్ర ప్రజలను మేము ఎందుకు హింసిస్తాం. మిజోరం సీఎం తన పరిధి దాటి మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని బీరేన్ పేర్కొన్నారు.