న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలు, వాటికి సంబంధించి సంస్థలు ప్రత్యక్షంగా బ్రాడ్కాస్టింగ్ లేదా బ్రాడ్కాస్టింగ్ కార్యకలాపాల పంపిణీలో పాల్గొనకూడదని కేంద్రం పేర్కొన్నది. ఇప్పటికే ఆయా కార్యకలాపాల్లో పాలుపంచుకొని ఉంటే..ఇకపై అది ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ ‘ప్రసార భారతి’ ద్వారా మాత్రమే జరుగాలని స్పష్టం చేసింది. ప్రసార కార్యకలాపాలను ప్రసార భారతి రూట్కు మార్చాలని, 2023, డిసెంబర్ 31లోగా బ్రాడ్కాస్టింగ్ పంపిణీ కార్యకలాపాల నుంచి విరమించుకోవాలని పేర్కొంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం అడ్వైజరీ జారీచేసింది.